Andhraprabha
Last Updated Mar 12 2010, 05:47:07, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

రాష్ట్రీయం 

అమలు తీరు బాగాలేదని ఆనాడే చెప్పా : బాబు

ఆంధ్రప్రభ ప్రతినిధి  -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

కుప్పం, కె.ఎన్‌.ఎన్‌ : రాష్ట్రంలోని మైనార్టీ ఓటర్లను దక్కించు కోనేం దుకు రాజశేఖర్‌రెడ్డి ప్రభు త్వం హడావుడిగా అవగా హన లేకుండా మైనార్టీ లకు రిజర్వేషన్‌ కల్పిస్తా మంటూ ప్రకటించిన విషయం పై తెలుగుదేశం పార్టీ ఆనాడే మైనార్టీ రిజర్వేషన్‌ అమలు తీరు బాగాలేదని చెప్పామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... మైనార్టీలకు రిజర్వేషన్లతోపాటు రాజకీయ రిజర్వేషన్‌ కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు రాష్ట్ర హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్‌ గురించి తప్పుపట్టిందని తెలుగుదేశం పార్టీ త్వరలోనే జడ్జిమెంట్‌ కాఫీలను చూసి స్పందించడం జరుగుతుందన్నారు. మైనార్టీ సోదర్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సి బాధ్యత ప్రభుత్వం పై ఉందని, దానికి అనుగుణంగా సాధ్యా సాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిందని, పేద ప్రజలు వాటిని కొనలేని పరిస్థితులు ఏర్పడందని, ధరలు తగ్గించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆయన అన్నారు. రెండవ సారి అధికారంలోకి రావడం కోసం విచ్చలవిడిగా రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ తరువాత రేషన్‌ కార్డులను తొలగిస్తున్నారని, అలాగే పింఛన్లను కూడా రద్దు చేస్తున్నారని, ఇది ఎంత వరకు సబబు అని యఆయన వాపోయారు. రాబోయే రోజుల్లో కిరోసిన్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేద ప్రజల పై మరింత భారం వేసేందుకు సతమతమౌతున్నదని ఆయన అన్నారు. ఆర్టీసి ధరలు వ్యాట్‌ ట్యాక్స్‌ రెండు శాతం పెంచి ప్రజల పై వెయ్యి కోట్ల అదనపు భారం వేసిందని, అలాగే కరెంటు ఛార్జీ కూడా పెంచేందుకు కూడా సిద్ధమవుతుందని, ధరలు తగ్గించకపోవడం వల్ల పేద ప్రజలు బ్రతుకులు మరింత దుర్భిర్యం అవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా తయారైందని, విజయవాడలో చిన్నారి వైష్ణవి హత్య ఇందుకు నిదర్శనమని, అలాగే నాటుసారా తాగి చాలా మంది మృత్యువాత పడ్డారని హైదరాబాద్‌లో నాసిరకం భవన నిర్మాణంతో కూలీలు చనిపోయారని, రాష్ట్రం దుర్భిర్య పరిస్థితులు ఎదుర్కొంటున్నదని ఆయయన అన్నారు. పేద ప్రజలు చితికిపోయే పరిస్థితులు ఏర్పడిందని, చేనేత, మత్స్య కారులు అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారని, పేద ప్రజలు ఇళ్లు కట్టుకొనే పరిస్థితులు లేరని, ముడిసరుకుల ధరలు విపరితంగా పెరిగిపోయిందని ఆయన అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లులో తీవ్ర అవినీతి చోటుచేసుకున్నదని, కాంగ్రెస్‌ కార్యకర్తలు రెండుమూడేసి ఇళ్ళు మంజూరు చేయించుకున్నారని, పేద ప్రజల బిల్లుల విషయంలో ప్రతి బిల్లులకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శాఖలోనూ అవినీతి ఎక్కువైందని, అధికారులు నిద్రపోతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటపడిందని, పాఠశాల్లో టీచర్లు లేక విద్యార్థులు ఉన్నారని, నియోజకవర్గంలో సగానికి పైగా టీచర్లను బదిలీ పేరుతో బదిలీచేశారని, జడ్పీచైర్మన్‌ ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియదని ఆయయన అన్నారు. పాలారు డ్యాము కడతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గత 6సంవత్సరాలుగా చెబుతున్నదని, కానీ కట్టిన దాఖలాలు లేవని, నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారైందని, అభివృద్ధి కుంటపడిందని, శాంతిభద్రతలు కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. నిరంతరం సమస్యల పరిష్కారం కోసం అదికారులకు చర్చలు చేస్తానని, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినా దిగులుపడకండని పేద ప్రజలకు తోడుగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఆంజనేయరెడ్డి, జడ్పీటిసి బాలాజినాయక్‌, ఎంపిటిసి అలివేలుమంగమ్మ, విజలాపురం బాబు, మునస్వామి, పట్రనారాయణ, సర్పంచ్‌ రామక్రిష్ణప్ప, రవి, నారాయయణ, సీతాపతి తదితరులు పాల్గొన్నారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

రాష్ట్రీయం ఇతర విశేషాలు

  • జర్నలిస్టుల వృత్తినైపుణ్యం పెంపుదలకు కృషి
  • చేనేత కార్మికుల సమస్యలపై చర్చకు విపక్షం పట్టు
  • ఎన్‌టిఆర్‌ అపురూప చిత్రాల పోటీలో శ్రీ పతి రాజేశ్వర్‌కు ప్రథమ బహుమతి
  • సికింద్రాబాద్‌ - నిజాముద్దీన్‌ నాన్‌ స్టాప్‌ ఎక్స్‌ ప్రెస్‌ను 14న ప్రారంభించనున్న సిఎం
  • ఎమ్మెల్యేలతో చంద్రబాబు ముఖాముఖి
  • మీడియా పాయింట్‌ కబుర్లు
  • ఎన్ని నాటకాలాడినా బాబు సిఎం కారు : నల్లపు రెడ్డి
  • ఒయుకు నిధులు కేటాయించండి : కిషన్‌ రెడ్డి
  • 33 శాతం వస్తే పరిస్థితి ఏమిటి భగవాన్‌!: పొన్నాల

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.