రాష్ట్రీయం
ముస్లిం రిజర్వేషన్లను వోట్లకోసం రూపోందించలేదు :
-
జగన్
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ముస్లింల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక రిజర్వేషన్లను రూపొందిం చారని, ఈ విషయంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. మైనారిటీలపై వైఎస్ ఆర్కు ఎనలేని ప్రేమ ఉండేదని, ఆ దిశలో ఆయన తీసుకున్న సంక్షేమచర్యలు వారి అభివృద్ధికి దోహదపడ్డాయని చెప్పారు. సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ హైదరాబాద్లోని తన నివాసంలో ముస్లిం రిజర్వేషన్లపై మీడియాతో మాట్లాడారు. మైనారిటీల కు ఇప్పటి వరకూ అమలు చేస్తున్న రిజర్వేషన్లపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడం వలన వారు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలసి సోనియా గాంధీని కలసి వారికి న్యాయం చేయాలని కోరతానని స్పష్టం చేశారు.
రాశి ఫలాలు






