అంతర్జాతీయం
అమెరికా విద్యుత్ కేంద్రంలో పేలుడు
మిడిల్టౌన్ (అమెరికా), ఫిబ్రవరి 8: అమెరికాలో నిర్మాణంలో ఉన్న ఒక గ్యాస్ ఆధారిత విద్యుత్ కర్మాగారంలో ఆదివారం సంభవించిన పెనుపేలుడులో ఐదుగురు మరణించగా 12 మంది గాయపడ్డారు. పేలుడు సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నదీ తెలియాల్సి ఉందని అయితే 50 మంది ఉన్నట్లు భావిస్తున్నామని ఒక అగ్నిమాపక అధికారి తెలిపారు. పేలుడు సంభవించగానే ఒక పెద్ద అగ్నిగోళం పైకి లేచినట్లు కనబడిందని, ఒకటిన్నర మైలు వరకు పొగ వ్యాపించిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ పేలుడు ధాటికి కర్మాగారంలో చాలా భాగం ధ్వంసం కావడంతో బాటు కొన్ని మైళ్ల దూరంలోని ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. 15 కిలో మీటర్ల దూరంలోని తమ మిత్రులు కూడా ఈ పేలుడు శబ్దం విని తమ క్షేమ సమాచారాల డిగారని వారు తెలిపారు. పోలీసు, సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని కార్యక్రమాలు చేపడుతున్నాయి.
రాశి ఫలాలు






