Andhraprabha
Last Updated Mar 12 2010, 05:47:07, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

అంతర్జాతీయం 

ద్వైపాక్షిక చర్చలపై భారత్‌ వెనకడుగు వేసింది:ఖురేషీ

apr  -   Tue, 9 Feb 2010, IST
   international
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

ఇస్లామాబాద్‌, ఫిబ్రవని 8: ద్వైపాక్షిక చర్యలపై ముందుగా వెనకడుగువేసింది భారత్‌ మాత్రమేనని, పాకిస్తాన్‌ కాదని విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషి పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు కొనసాగించబోమని ముందుగా భారత ప్రభుత్వమే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని ముల్తాన్‌ పట్టణంలో ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో ఖురేషీ మాట్లాడుతూ పాక్‌తో చర్చలు కొనసాగించబోమని ప్రకటించిన భారత్‌ రెండు రోజుల క్రితం పాక్‌తో సంబంధాలు పునురుద్ధరిస్తామని ప్రకటించిందని తెలిపారు. పాకిస్తాన్‌ ఎవరికీ తలవంచదని, తాను ఎప్పుడూ ఎవరిముందు మోకరిల్లలేదని ఆయన చెప్పారు. కాశ్మీర్‌ వివాదమైనా, మరే సమస్యపైనైనా పాకిస్తాన్‌ తన వాదనను బలంగా వినిపిస్తుందని ఖురేషీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలలో కాశ్మీర్‌ వివాదానికి సంబంధించిన 8 అంశాలకు పరిష్కారం కనుగొనాల్సివుందని ఖురేషీ తెలిపారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

అంతర్జాతీయం ఇతర విశేషాలు

  • భారత్‌-అమెరికా అణు ఒప్పంద ధ్రువీకరణ అధికారిగా హిల్లరీ
  • సహాయ కార్యక్రమాల అమలులో భారత్‌లో ఎన్నో సవాళ్ళు
  • చిలీ భూకంప బాధితులకు భారత్‌ విరాళం 50 లక్షల డాలర్లు

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.