ముఖ్యాంశాలు
న్యూస్ రేటింగ్లో ఆంధ్రప్రభకు ద్వితీయ స్ధానం
-
మీడియా ఫాస్ట్ సోసైటీ వెల్లడి
ఖమ్మం (కెఎన్ఎన్ బ్యూరో): జిల్లా కేంద్రమైన ఖమ్మంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన రాష్ట్ర నంది నాటకోత్సవాలకు సంబంధించి వివిధ దిన పత్రికలు రాసిన వార్తా కథనాల న్సూస్ రేటింగ్ పై మీడియా ఫాస్ట్ సొసైటీ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రభ ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే విధంగా సాంఘిక నాటకాల విశ్లేషణలో ఆంధ్రప్రభ మొదటి స్థానంలో నిలిచింది. కాగా న్యూస్ రేటింగ్లో సాక్షి మొదటి స్థానంలో నిలవగా తృతీయస్థానంలో ఆంధ్ర జ్యోతి, నాలుగవ స్థానంలో ఈనాడు, ఐదవ స్థానంలో వార్త, ఆరవ స్థానంలో సూర్య, ఏడవ స్థానంలో ఆంధ్రభూమి నిలిచాయి. పద్యనాటిక విశ్లేషణలో వార్త బెస్ట్ కాగా బాలల నాటకాల విశ్లేషణలో సాక్షి, విశ్లేషణాత్మక పోటోల్లో ఈనాడు బెస్ట్గా నిలిచాయి. ఫోటోల కవరేజిలో సాక్షి బెస్ట్గా నిలిచింది. రాష్ట్రంలో నంది నాటకాలు జరిగిన ప్రతీ చోట ఈ విధమైన న్యూస్ రేటింగ్ పై ఈ సంస్థ సర్వే చేస్తుందని మీడియా ఫాస్ట్ సొసైటీ (హైదరాబాద్) వారు వెల్లడించారు.
రాశి ఫలాలు






