Andhraprabha
Last Updated Mar 12 2010, 05:47:07, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

ముఖ్యాంశాలు 

తూర్పులో దొరికిన పశ్చిమ పందెంరాయుళ్ళు

apr -   Tue, 9 Feb 2010, IST
 ముఖ్యాంశాలు
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

కాకినాడ, (కెఎన్‌ఎన్‌ ప్రతినిధి) : సంక్రాంతి సీజన్‌ ముగిసినా కోడిపందాల జోరు తగ్గలేదు. జిల్లాలో పెద్దఎత్తున నిర్వహిస్తున్న కోడిపందాల్లో పాల్గొనేందుకు పశ్చిమగోదావరి నుంచి పెద్దఎత్తున పందెంరాయుళ్ళు ఇక్కడికి తరలివస్తున్నారు. కాగా సోమవారం తెల్లవారుఝామున జిల్లా ఎస్‌పి నాగిరెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్‌ బృందం దాడి జరిపి ఓ ఎమ్మెల్యేతో సహా పలువురు పందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకుంది. రాజకీయ ఒత్తిళ్ళ మేరకు ఆ ఎమ్మెల్యేను విడిచిపెట్టారు.

పట్టపగలే పచ్చని పంటపొలాల్లో జూదం ఆడుతూ స్థానికుల సహాయంతో కోడిపందాలు నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేసారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరులో సోమవారం చోటు చేసుకుంది. వెంటూరులో గత కొంతకాలంగా కోట్లలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌పి ఆదేశాల మేరకు కాకినాడ టౌన్‌ సిఐ రవికాంత్‌, టు టౌన్‌ ఎస్‌ఐ ఆలి బృందం సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడి చేసింది. వెంటూరులోని చుండ్రు మల్లిఖార్జునరావు (మల్లిబాబు) అనే వ్యక్తికి చెందిన పశువులపాకలో ఫ్లడ్‌ లైట్‌ల వెలుతురులో కోడిపందాలు ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్‌ చేసారు.

ఆ ప్రాంతంలో హైటెక్‌ స్థాయిలో మద్యం బాటిళ్లు, కుర్చీలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వీరి నుండి రూ.2.18లక్షలనగదు, 51కోడి కత్తులు, 30 కారులు, 17 సెల్‌ఫోన్‌లు, జనరేటర్‌లు, 2 మోటార్‌సైకిళ్లు, 2 కోడిపుంజులు, 65 ప్లాస్టిక్‌ కుర్చీలు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బలమైన ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు బడాబాబులు జూదం ఆడేందుకు తరలి వస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన డిఎస్‌పి వారికి సహకరిస్తున్నట్లు సమాచారం. అదే సామాజికవర్గం వారు వెంటూరులో అధిక సంఖ్యలో నివసిస్తుండడంతో గ్రామానికి చెందినవారెవరూ సంఘటనపై నోరు మెదిపేందుకు సాహసించడంలేదు. పోలీసుల బృందం 30వాహనాలతో పాటు 24మందిని అరెస్టు చేసింది. అయితే రాజకీయ సిఫార్సుల మేరకు ఎమ్మెల్యేను తప్పించడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు వాహనం కూడా ఉందని జిల్లా ఎస్‌పి నాగిరెడ్డి తెలిపారు.కోడి పందాలు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనపర్తి సిఐ త్రినాధరావును విఆర్‌లో పంపామని ఎస్‌పి తెలిపారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

  • ఆర్థిక వ్యవస్థకు తూట్లు దొంగ నోట్లు
  • జంట హత్యల కేసులో 16 మందికి జీవిత ఖైదు
  • మహిళా బిల్లుపై బిజెపిలో లుకలుకలు
  • అత్యంత ధనవంతుడు కార్లోస్‌ స్లిమ్‌
  • నేటి నుంచే క్రికెట్‌ పండగ
  • రుణ మాఫిలో ఘోర వైఫల్యం
  • మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్‌హంట్‌ షురూ
  • జగన్‌ను పిసిసి అధ్యక్షుడిని చేస్తే డిఎస్‌ని ఎక్కడికి పంపిస్తారు: జెసి
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై యుపిఎ వెనుకడుగు?

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.