ముఖ్యాంశాలు
ఆటోను ఢకొన్న భట్టి 'ఎస్కార్ట్'
-
ఐదుగురు మృతి
-
9 మందికి గాయాలు
నల్గొండ, కెఎన్ఎన్ బ్యూరో: ప్రభుత్వ చీఫ్ విప్ భట్టివిక్రమార్క ఎస్కార్ట్ వాహనం ఎదురుగా వెళ్తున్న వాహానాన్ని ఓవర్టెక్ చేస్తూ ఆటోను ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందారు. మరో 9మంది గాయపడగా వారిలో నలుగురి పరిస్ధితి ప్రమాదకరంగా ఉంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ చీఫ్విప్ ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళ్తుండగా ఆయనకు ఎస్కార్ట్గా వస్తున్న జీపు హైద్రాబాద్ నుంచి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టుకు వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన భార్యా భర్తలు జయచందర్గౌడ్ (35), అతని భార్య లింగమ్మ(29)తో పాటు హైదరాబాద్లోని సూరారానికి చెందిన ఆటో డ్రైవర్ రాములు అక్కడికక్కడే మృతిచెందారు. అఖిల్ (5), కొయ్యలగూడెం గ్రామానికి చెందిన రాదాధేవి హైద్రాబాద్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. జయచందర్గౌడ్ కుటుంబం మొక్కు తీర్చుకునేందుకు నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి బంధువులతో కలిసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో జయచందర్గౌడ్ కుమార్తె నిహారిక, అతని సమీప బంధువులు శివ, గుర్రం నరేందర్, గాయాలపాలయ్యారు. ఆటోను ఢీ కొట్టిన ఎస్కార్ట్ జీపులో ప్రయాణిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోలీసులు గంగరాజు, హరినాధ్, రాగ్జీ, నాగేశ్వర్రావు, లచ్చిరాం, ఎండి గౌస్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. తన ఎస్కార్ట్ జీపు ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన, గాయపడిన వారిని కనీసం పట్టించుకోకుండా హైద్రాబాద్ వెళ్ళిపోయిన ప్రభుత్వ చీఫ్విప్పై ఆ ప్రాంత వాసులు ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. ఇందుకు నిరసనగా చౌటుప్పల్లోరాస్తారోకో నిర్వహించారు.
మృతులకు రూ.లక్ష ఎక్స్గ్రేషియా
ప్రభుత్వ చీఫ్ విప్ భట్టివిక్రమార్క ఎస్కార్ట్ వాహనం ఢీ కొన్న సంఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ. లక్షను సిఎం సహాయ నిధి నుంచి అందించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని ఐటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి తో పాటు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్త పర్చారు.
రాశి ఫలాలు






