Andhraprabha
Last Updated Mar 11 2010, 03:32:33, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

బిజినెస్ 

పన్నుల సంస్కరణల ప్రపంచ సంస్ధలో భారత్‌ కీలక భూమిక

apr -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

న్యూఢిల్లిd, ఫిబ్రవరి 8 : అమలులో ఉన్న అంతర్జాతీయ పన్నుల పద్ధతులను మెరుగుపరచ డంద్వారా వర్థమానదేశాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రపంచ ఆర్థిక సహకారం, అభవృద్ధి సంస్థ (ఒసిఇడి) ఏర్పాటు చేయదలచిన టాస్క్‌ ఫోర్స్‌లో భరతదేశం ప్రధాన పాత్ర పోషించగలదని ఒసిఇడికి చెందిన ఉన్నత స్థాయి అధికారి ఒకరు అన్నారు. ప్రాథమికంగా ఒసిఇడి సంపన్న దేశాలతో ఏర్పడిన గ్రూపు. ఈ టాస్క్‌ ఫోర్స్‌ స్వరూపంగురించి అడిగిన ప్రశ్నకు ఇందులో 20నుంచి 30 దేశాలు సభ్యులని ఆ అధికారి చెప్పారు. ''ఈ టాస్క్‌ ఫోర్స్‌లో భారత దేశం పోషించే పాత్రపై భారత ప్రభుత్వంతో చర్చిస్తాం. భారత దేశంగనుక ఈ టాస్క్‌ ఫోర్స్‌లో చేరేందుకు ఆసక్తి చూపితే ప్రముఖ పాత్ర లేదా నాయకత్వ పాత్రను భారత్‌ పోషించగలదు. తన అనుభవాన్ని రంగరించి లక్ష్య సాధనకు భారత దేశం ఎంతగానో దోహదపడుతుంది'' అని ఒక వార్తా సంస్థకు పారిస్‌ నుంచి ఇ-మెయిల్‌ ద్వారా ఆ అధికారి తెలిపారు. వర్థమాన దేశాలు, ఎన్‌జిఒలు, వాణిజ్య సంస్థలుకూడా భాగస్వాములు కావడంద్వారా ప్రపంచ పన్నుల విషయాలలో ఈ టాస్క్‌ ఫోర్స్‌ పటిష్ఠమైన ఉమ్మడి పద్ధతులను అమలు చేసేందుకు సహాయ పడుతుంది అన్నది ఒఇసిడి అభిప్రాయం. నూతన ప్రపంచ పరిస్తితులలో వర్థమాన దేశాలకు ప్రయోజనం చేకూరేవిధంగా బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థలలో పారదర్శకతను పెంపొందించి పన్నులనుంచి తప్పించు కునేందుకు వీలులేని ఒక కార్యక్రమాన్ని రూపొందిం చడం అన్నది ఈ టాస్క్‌ ప్రోర్స్‌ ప్రాధాన్యతా అంశాలలో ఒకటి అని ఆ అధికారి చెప్పారు. డూప్లి కేషన్‌ జరుగకుండా ఒక స్పష్టమైన, ప్రభావవంతమైన అమలు యంత్రాంగాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో త్వరలో ఒఇసిడి టాస్క్‌ ఫోర్స్‌ ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. లాంఛనంగా ఈ టాస్క్‌ ఫోర్స్‌ పన్నులు, అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతులను క్రోడీకరిస్తుంది అని ఒఇసిడి గతనెలలో ప్రకటించడం జరిగింది. ఈ టాస్క్‌ ఫోర్స్‌లో ఎన్‌జిఒల భాగస్వామ్యాన్నిగురించి ప్రస్తావించి వీరి సంఖ్య ఎంత ఉండాలి అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ముగ్గురు ఎన్‌జిఒలు టాస్క్‌ ఫోర్స్‌లో ఉండగలరని ఆ అధికారి అన్నారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

బిజినెస్ ఇతర విశేషాలు

  • ఎన్‌ఎండిసి ఇష్యూకు స్పందన కరవే!
  • బిజినెస్‌ సంక్షిప్త వార్తలు
  • 'సర్వీస్‌ ఎడ్జ్‌'ని ప్రారంభించిన టాటా మోటార్స్‌
  • మాన్‌ ఇండస్ట్రీస్‌ రూ.950 కోట్ల ఆర్డర్‌
  • రెండవదశ విస్తరణలో రోజ్‌గార్‌ దునియా
  • తాత్కాలిక ఉద్యోగులకే పెద్దపీట
  • జనవరిలో 25 శాతం తగ్గిన ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో
  • 'త్వరలో శంషాబాద్‌లో ఎస్‌బిటి శాఖ'
  • ఒడిదుడుకుల నడుమ స్వల్ప లాభాలు

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.