తాజావార్తలు
సోనియా దృష్టికి ముస్లిం రిజర్వేషన్ : వైఎస్ జగన్
హైదరాబాద్: ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 4శాతం రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం కలసికట్టుగా పోరాడుతామని, ముస్లింలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయేనని కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తూ ఇచ్చిన తీర్పును బట్టి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మైనారిటీల పట్ల డాక్టర్ రాజశేఖర్రెడ్డికి ఎనలేని ప్రేమ ఉందని అన్నారు. ఈ విషయాన్ని యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళతానని ఆయన అన్నారు. ం
రాశి ఫలాలు






