తాజావార్తలు
ఫాలో ఆన్లోనూ తడబడిన భారత జట్టు
నాగపూర్ : భారత్,దక్షిణాఫ్రికాల్లో జరుగుతున్న తొలిటెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న టీమిండియా ప్రారంభంలోనే ఓపెనర్ల టికెట్లు కోల్పోయింది. సెహ్వాగ్ 16 పరుగులు చేసి అవుటవగా, గంభీర్ కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్కు చేరాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు స్టెయిన్, మోర్కల్లకు ఈ రెండు వికెట్లు దక్కాయి. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భరత్ 66 పగుగుల వద్ద 2 వికెట్లు కోల్పోవియి ఆట కొసాగిస్తోంది. మురళీ విజయ్ 27, సచిన్ 15 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా తొలిఇన్నింగ్స్ స్కోరును అధిగమించాలంటే టీంమిండియా ఇంకా 259 పరుగులు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ను 558 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేయగా, ఇండియా జట్టు 233 పరుగులకు ఆలౌట య్యింది.
రాశి ఫలాలు






